'My Mom Called, Said She's Coming to Watch the Game for Virat Kohli': Joshua da Silva - Sakshi
Sakshi News home page

IND vs WI: 'నేను అస్సలు నమ్మలేకపోతున్నా విరాట్‌ సర్‌.. మా అమ్మ మిమ్మల్ని చూడటానికే వస్తోంది'

Jul 21 2023 4:03 PM | Updated on Jul 21 2023 4:23 PM

My Mom Said Shes Coming to Watch The Match For Virat Kohli - Sakshi

ట్రినిడాడ్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమిండియా పూర్తి అధిపత్యం చెలాయించింది. మెదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి(87 నాటౌట్‌) సెంచరీకి చేరువలో ఉన్నాడు. మరో 13 పరుగులు సాధిస్తే తన 29వ టెస్టు సెంచరీ కింగ్‌ కోహ్లి అందుకుంటాడు.

ఇది కోహ్లికి 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ అన్న సంగతి తెలిసిందే. ప్రపంచక్రికెట్‌లో తన 500 మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా విరాట్‌ నిలిచాడు. ప్రస్తుతం కోహ్లితో పాటు క్రీజులో రవీంద్ర జడేజా 36(నాటౌట్) ఉన్నాడు. అంతకుముందు రోహిత్ శర్మ (80) యశస్వి జైస్వాల్ 57 పరుగులతో రాణించారు. అదే విధంగా శుబ్‌మన్‌ గిల్‌(10), రహానే(8) మాత్రం మరోసారి నిరాశ పరిచారు.

ఇక ఇది ఇలా ఉండగా.. రెండో రోజు ఆట సందర్భంగా విండీస్‌ వికెట్‌ కీపర్‌ జాషువా డా సిల్వా, భారత స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. కోహ్లి కోసం తన అమ్మ మ్యాచ్‌ చూసేందుకు వస్తున్నట్లు జాషువా డా సిల్వా తెలిపాడు. "మా అమ్మ నాకు ఫోన్ చేసి విరాట్‌ కోహ్లి కోసం మ్యాచ్ చూడటానికి వస్తున్నానని చెప్పింది.

అది నేను నమ్మలేకపోయాను" అని కోహ్లితో డా సిల్వా అన్నాడు. అందుకు బదులుగా కోహ్లి కూడా ఓ అవునా అంటూ నవ్వుతూ తలఊపాడు. ఇదింతా స్టంప్‌ మైక్‌లో రికార్డైంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Virender Sehwag: సన్‌రైజర్స్‌ హెడ్‌కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్.. ఇక తిరుగుండదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement