
పంజాబ్పై ఆర్సీబీ ఘన విజయం
18.5వ ఓవర్- నేహల్ వధేరా బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన జితేశ్ శర్మ (11) మ్యాచ్ను ముగించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ఆర్సీబీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మూడో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
16.4వ ఓవర్- 143 పరుగుల వద్ద ఆర్సీబీ మూడో వికెట్ కోల్పోయింది. చహల్ బౌలింగ్లో జన్సెన్కు క్యాచ్ ఇచ్చి పాటిదార్ (12) ఔటయ్యాడు.
హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి
విరాట్ 43 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 15 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 122/2గా ఉంది. విరాట్ (50), పాటిదార్ (9) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే 30 బంతుల్లో 36 పరుగులు చేయాలి.
రెండో వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
12.3వ ఓవర్- 109 పరుగుల వద్ద ఆర్సీబీ రెండో వికెట్ కోల్పోయింది. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో నేహల్ వధేరాకు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ (61) ఔటయ్యాడు.
లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న ఆర్సీబీ
158 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ లక్ష్యం దిశగా అడుగులు వేస్తుంది. 9 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ వికెట్ నష్టానికి 75 పరుగులుగా ఉంది. విరాట్ (35), పడిక్కల్ (38) క్రీజ్లో ఉన్నారు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ గెలవాలంటే 66 బంతుల్లో మరో 83 పరుగులు చేయాలి.
ధాటిగా ఆడుతున్న కోహ్లి, పడిక్కల్
ఛేదనలో ఆర్సీబీ ఆదిలోనే సాల్ట్ వికెట్ కోల్పోయినప్పటికీ ధాటిగానే ఆడుతుంది. విరాట్ (31), పడిక్కల్ (22) బ్యాట్ ఝులిపిస్తున్నారు. 6 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 54/1గా ఉంది.
తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆర్సీబీ
158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్ చివరి బంతికి అర్షదీప్సింగ్ బౌలింగ్లో వికెట్కీపర్ జోస్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి ఫిల్ సాల్ట్ (1) ఔటయ్యాడు.
విజృంభించిన ఆర్సీబీ బౌలర్లు.. పంజాబ్ స్కోరెంతంటే?
ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి కేవలం 157 పరుగులు చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (22), ప్రభ్సిమ్రన్ సింగ్ (33), వికెట్ కీపర్ జోష్ ఇంగ్లిస్ (29), శశాంక్ సింగ్ (31 నాటౌట్), మార్కో యాన్సెన్ (25 నాటౌట్) ఓ మోస్తరుగా పరుగులు రాబట్టారు.
మిగతా వాళ్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (6), నేహాల్ వధేరా (5 రనౌట్), మార్కస్ స్టొయినిస్ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో స్పిన్నర్లు కృనాల్ పాండ్యా, సూయశ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. పేసర్ రొమారియో షెఫర్డ్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
పదహారు ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ స్కోరు: 129-6
యాన్సెన్ 11, శశాంక్ 19 పరుగులతో ఉన్నారు. మరోవైపు.. ఆర్సీబీ స్పిన్నర్ సూయశ్ శర్మ స్థానంలో బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఇంపాక్ట్ సబ్గా వచ్చాడు.
ఆరో వికెట్ డౌన్
13.5: సూయశ్ శర్మ బౌలింగ్లో స్టొయినిస్ (1) బౌల్డ్. మార్కో యాన్సెన్ క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 114-6(14). శశాంక్ సింగ్ 15 పరుగులతో ఉన్నాడు.
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్
13.2: సూయశ్ శర్మ బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్ (29) బౌల్డ్ అయ్యాడు. మార్కస్ స్టొయినిస్ క్రీజులోకి వచ్చాడు. శశాంక్ 14 పరుగులతో ఉన్నాడు. పంజాబ్ స్కోరు: 112/5 (13.2) .
సెంచరీ కొట్టిన పంజాబ్
12 ఓవర్లు ముగిసే సరికి పంజాబ్ నాలుగు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసింది. ఇంగ్లిష్ 22, శశాంక్ సింగ్ 9 పరుగులతో ఉన్నారు.
నాలుగో వికెట్ కోల్పోయిన పంజాబ్
8.6: సూయశ్ శర్మ బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్- నేహాల్ వధేరా (5)తో కలిసి సింగిల్ తీశాడు. అయితే, రెండో పరుగు తీసే క్రమంలో ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడంతో నేహాల్ వధేరా రనౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ నాలుగో వికెట్ కోల్పోయింది. పంజాబ్ స్కోరు: 76/4 (9). శశాంక్ సింగ్ క్రీజులోకి వచ్చాడు.
శ్రేయస్ అయ్యర్ అవుట్
7.4: రొమారియో షెఫర్డ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ (6)కృనాల్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. నేహాల్ వధేరా క్రీజులోకి వచ్చాడు. పంజాబ్ స్కోరు: 69/3 (7.5) . జోష ఇంగ్లిస్ ఐదు పరుగులతో ఉన్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన పంజాబ్
6.1: ప్రభ్సిమ్రన్ (33) రూపంలో పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి ప్రభ్సిమ్రన్ పెవిలియన్ చేరాడు. జోష్ ఇంగ్లిస్ అతడి స్థానంలో క్రీజులోకి వచ్చాడు.
పవర్ ప్లేలో పంజాబ్ స్కోరు: 62-1(6)
ప్రభ్సిమ్రన్ 33, శ్రేయస్ అయ్యర్ ఐదు పరుగులతో క్రీజులో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్
4.2: కృనాల్ పాండ్యా బౌలింగ్లో తొలి వికెట్గా వెనుదిరిగిన ప్రియాన్ష్ ఆర్య (22). క్రీజులోకి శ్రేయస్ అయ్యర్.
నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు
ప్రభ్సిమ్రన్ 10 బంతుల్లో 19, ప్రియాన్ష్ ఆర్య 14 బంతుల్లో 22 పరుగులతో ఆడుతున్నారు. నాలుగు ఓవర్లలో పంజాబ్ స్కోరు: 41-0
తొలి ఓవర్లో పంజాబ్ స్కోరు: 2-0
కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్. ప్రియాన్ష్, ప్రభ్సిమ్రన్ ఒక్కో పరుగుతో ఉన్నారు.
🚨 Toss 🚨@RCBTweets won the toss and elected to bowl against @PunjabKingsIPL in Match 37.
Updates ▶️ https://t.co/6htVhCbltp#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/gg5M40bjrg— IndianPremierLeague (@IPL) April 20, 2025
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ (PBKS vs RCB) మధ్య ఆదివారం మ్యాచ్ జరుగనుంది. చండీగడ్లోని ముల్లన్పూర్లో గల మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇందుకు వేదిక. టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకోగా.. ఆతిథ్య పంజాబ్ బ్యాటింగ్ చేసింది.
తుదిజట్లు
పంజాబ్
ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, అర్ష్దీప్ సింగ్, యజువేంద్ర చహల్
ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: హర్ప్రీత్ బ్రార్, విజయ్కుమార్ వైషాక్, సూర్యాంశ్ షెడ్గే, గ్లెన్ మాక్స్వెల్, ప్రవీణ్ దూబే
ఆర్సీబీ
ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సూయశ్ శర్మ, జోష్ హాజిల్వుడ్, యశ్ దయాల్.
ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: దేవదత్ పడిక్కల్, రసిఖ్ దార్ సలామ్, మనోజ్ భండాగే, జేకబ్ బెతెల్, స్వప్నిల్ సింగ్.
ప్రతీకారం తీర్చుకోవాలని
కాగా ఈ సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీతో తలపడ్డ పంజాబ్ సొంతమైదానంలోనే వారిని ఓడించింది. వర్షం వల్ల పద్నాలుగు ఓవర్లకు కుదించిన మ్యాచ్లో బెంగళూరు జట్టుపై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పంజాబ్ను వారి సొంత గడ్డపై ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఆర్సీబీ పట్టుదలగా ఉంది.