ఐపీఎల్ ఫైనల్.. ఎవరు గెలిచినా అది మాత్రం తప్పదు: ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ | Director SS Rajamouli Tweet On IPL Final Match Between RCB and PBKS | Sakshi
Sakshi News home page

SS Rajamouli: ఐపీఎల్ ఫైనల్‌.. టైటిల్‌కు ఆ ఇద్దరు అర్హులే: ఎస్ఎస్ రాజమౌళి

Jun 2 2025 1:09 PM | Updated on Jun 2 2025 1:33 PM

Director SS Rajamouli Tweet On IPL Final Match Between RCB and PBKS

ఐపీఎల్‌ క్వాలిఫయర్-2 మ్యాచ్‌పై దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ముంబయితో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ అద్భుతమైన విజయం సాధించడంపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా బుమ్రా, బౌల్ట్ యార్కర్లను థర్ట్‌ మ్యాన్‌ దిశగా బౌండరీకి తరలించడంపై కెప్టెన్ శ్రేయస్ అ‍య్యర్‌ను కొనియాడారు. అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉందని ట్వీట్ చేశారు.

గతంలో ఢిల్లీ టీమ్‌ను ఫైనల్‌కు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్‌ను వదిలేశారని.. ఆ తర్వాత  కోల్‌కతాకు ట్రోఫిని అందించినా శ్రేయస్‌ అయ్యర్‌ను మళ్లీ తీసుకోలేదని రాజమౌళి పోస్ట్ చేశారు. ఈ ఏడాది దాదాపు 11 ఏళ్ల తర్వాత పంజాబ్‌ను ఫైనల్‌ వరకు తీసుకొచ్చిన శ్రేయస్ అయ్యర్‌ టైటిల్‌ కొట్టేందుకు పూర్తిగా ‍అర్హుడని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో విరాట్ కోహ్లీ కొన్నేళ్లుగా బెంగళూరు తరపున వేల పరుగులు సాధించాడని.. కానీ టైటిల్‌ గెలిచేందుకు సమయం ఆసన్నమైందని రాసుకొచ్చాడు. ఈ ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్‌లో ఫలితం ఏదైనా హార్ట్‌ బ్రేకింగ్‌ మాత్రం తప్పదని అంటున్నారు రాజమౌళి.

ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మన దర్శకధీరుడు క్రికెట్‌పై ట్వీట్‌ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మహేశ్ బాబుతో ఓ భారీ అడ్వెంచరస్‌ మూవీని తెరకెక్కిస్తున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుంది. ఇటీవలే ఒడిశాలో రాజమౌళి- మహేశ్ ‍బాబు సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement