IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌ | Iceland Cricket Creates IPL 2025 Frauds And Scammers Team, Rishabh Pant Named Captain | Sakshi
Sakshi News home page

IPL 2025: చెత్త ప్రదర్శన చేసిన ఆటగాళ్లతో జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషబ్‌ పంత్‌

May 6 2025 6:09 PM | Updated on May 6 2025 6:49 PM

Iceland Cricket Creates IPL 2025 Frauds And Scammers Team, Rishabh Pant Named Captain

Photo Courtesy: BCCI

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఘెరంగా విఫలమవుతున్న ఆటగాళ్లతో ఓ జట్టును రూపొందించింది ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌. ఈ జట్టుకు సారధిగా రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేసింది. ఈ జట్టుకు ఐపీఎల్‌ 2025 మోసగాళ్లు, స్కామర్ల జట్టని నామకరణం చేసింది. 

ఈ జట్టులో రాహుల్‌ త్రిపాఠి, రచిన్‌ రవీంద్ర, ఇషాన్‌ కిషన్‌, రిషబ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, దీపక్‌ హుడా, రవిచంద్రన్‌ అశ్విన్‌, మతీష పతిరణ, మహ్మద్‌ షమీకి చోటు కల్పించింది. పంత్‌ను కెప్టెన్‌ కమ్‌ వికెట్‌ కీపర్‌గా ఎంపిక చేసింది. ఈ జట్టును నిన్న తమ ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.

ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ఎంపిక చేసిన ఈ టీమ్‌పై సోషల్‌మీడియాలో విపరీతమైన స్పందన వస్తుంది. నిజంగానే వీరు స్కామర్లు, మోసగాళ్లు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కోట్లలో డబ్బు తీసుకుని కనీస వందల విలువ చేసే ప్రదర్శన కూడా చేయలేకపోతున్నారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 

కొందరేమే ఆటగాళ్లు ఎలా ఆడినా ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ఇలాంటి విమర్శలు చేయకూడదని సలహాలు ఇస్తున్నారు. కాగా, ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌కు ఇలాంటి వివాదాస్పద పోస్ట్‌లు చేయడం​ కొత్తేమీ కాదు. క్రికెట్‌కు సంబంధించిన అంశాలపై గతంలో చాలా సందర్భాల్లో వ్యంగ్యంగా స్పందించింది.

ఇదిలా ఉంటే, మోసగాళ్లు.. స్కామర్లు అంటూ ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ఐపీఎల్‌ ఆటగాళ్లను విమర్శించడం సరి కాదని క్రికెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారి అభిప్రాయాన్ని పక్కన పెడితే, ఐస్‌ల్యాండ్‌ క్రికెట్‌ ప్రకటించిన జట్టులోని ఆటగాళ్లుందరూ తీసుకున్న డబ్బుకు న్యాయం చేయలేకపోతున్నారన్నది కాదనలేని సత్యం. 

రిషబ్‌ పంత్‌, వెంకటేశ్‌ అయ్యర్‌ లాంటి ఆటగాళ్లు 20 కోట్లకు పైగా మొత్తాన్ని తీసుకున్నా కనీస ప్రదర్శన చేయలేకపోతున్నారు. మిగతా ఆటగాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. మ్యాక్స్‌వెల్‌, లివింగ్‌స్టోన్‌ లాంటి విదేశీ ఆటగాళ్లయితే ఏదో హాలిడేకి వచ్చామన్నట్లు ఐపీఎల్‌ను చాలా ఈజీగా తీసుకుంటున్నారు. 

ఇషాన్‌ కిషన్‌, షమీపై వారి ఫ్రాంచైజీ ఎంతో నమ్మకముంచితే వారు ఆ నమ్మకాన్ని వమ్ము చేశారు. అశ్విన్‌ అయితే తనకున్న ఘన చరిత్రను చెత్త ప్రదర్శనలతో దిగజార్చుకున్నాడు. రాహుల్‌ త్రిపాఠి, దీపక్‌ హుడా లాంటి వారు కోట్లు మింగి గల్లీ క్రికెటర్ల కంటే హీనమైన క్రికెట్‌ను ఆడుతున్నారు.

రాహుల్‌ త్రిపాఠి- 3.4 కోట్లు
రచిన్‌ రవీంద్ర- 4 కోట్లు
ఇషాన్‌ కిషన్‌- 11.25
దీపక్‌ హుడా- 1.7 కోట్లు
రిషబ్‌ పంత్‌- 27 కోట్లు
వెంకటేశ్‌ అయ్యర్‌- 23.75
గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌- 4.2 కోట్లు
లియామ్‌ లివింగ్‌స్టోన్‌- 8.75 కోట్లు
రవిచంద్రన్‌ అశ్విన్‌- 9.75 కోట్లు
మతీష పతిరణ- 13 కోట్లు
మహ్మద్‌ షమీ- 10 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement