సహజకు డబుల్స్‌ టైటిల్‌ | Hyderabad player Sahaja Yamalapalli wins doubles title | Sakshi
Sakshi News home page

సహజకు డబుల్స్‌ టైటిల్‌

Jun 10 2025 1:45 AM | Updated on Jun 10 2025 1:45 AM

Hyderabad player Sahaja Yamalapalli wins doubles title

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) డబ్ల్యూ35 మహిళల టోర్నీలో హైదరాబాద్‌ ప్లేయర్‌ సహజ యామలపల్లి డబుల్స్‌ టైటిల్‌ను సాధించింది. డొమినికన్‌ రిపబ్లిక్‌ రాజధాని సాంటో డొమింగోలో జరిగిన ఈ టోర్నీలో సహజ (భారత్‌)–హిరోకో కువాటా (జపాన్‌) జోడీ డబుల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. 

ఫైనల్లో సహజ–హిరోకో ద్వయం 6–3, 6–2తో ఎస్తెర్‌ అడెషినా (బ్రిటన్‌)–సోఫియా ఎలీనా (వెనిజులా) జంటపై గెలిచింది. ఐటీఎఫ్‌ సర్క్యూట్‌లో సహజకిదే తొలి డబుల్స్‌ టైటిల్‌. సింగిల్స్‌ విభాగంలో ఆమె నాలుగు టైటిల్స్‌ సొంతం చేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement