సర్పంచ్‌లు ప్రజల మన్ననలు పొందాలి | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌లు ప్రజల మన్ననలు పొందాలి

Dec 15 2025 12:23 PM | Updated on Dec 15 2025 12:23 PM

సర్పంచ్‌లు ప్రజల మన్ననలు పొందాలి

సర్పంచ్‌లు ప్రజల మన్ననలు పొందాలి

మాజీ మంత్రి హరీశ్‌రావు

మాజీ మంత్రి హరీశ్‌రావు

గజ్వేల్‌: సర్పంచ్‌లుగా ఎన్నికైనవారు ప్రజల మన్ననలు పొందాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదివారం గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మాదాసు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తొలివిడత ఎన్నికల్లో గజ్వేల్‌ మండలం ఆహ్మదీపూర్‌ సర్పంచ్‌గా ఎన్నికై న ప్రభాకర్‌, ఉప సర్పంచ్‌ గోపాల్‌రెడ్డి, వార్డుసభ్యులు హరీశ్‌రావును కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు వారిని శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామ బీఆర్‌ఎస్‌ నాయకులు మద్ది రాజిరెడ్డి, చాడ శ్రీనివాస్‌రెడ్డి, పాల రమేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement