
బెట్టింగ్లతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దు
ప్రశాంత్నగర్(సిద్దిపేట): బెట్టింగ్ల జోలికి వెళ్లి తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని టూ టౌన్ సీఐ ఉపేందర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ నగర్ డబుల్ బెడ్రూం కాలనీలో ఆదివారం పోలీసు కళాబృందం కనువిప్పు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రంలో పాల్గొన్న ఉపేందర్ మాట్లాడుతూ యుక్త వయసులో ఉన్న యువతీయువకులను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు విధిగా నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఆశ, భయం, మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వ్యక్తిగత సమాచారం ఇతరులకు తెలియజేయవద్దని కోరారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు. అలాగే మూఢనమ్మకాలు, చేతబడులు, రోడ్డు ప్రమాదాలు, గంజాయి ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, సామాజిక రుగ్మతల గురించి కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, నాటకం, పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సంజీవరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
టూటౌన్ సీఐ ఉపేందర్