
యోగాతో మహిళల ఆరోగ్యం పదిలం
ప్రశాంత్నగర్(సిద్దిపేట): ప్రతి రోజు యోగా చేయడం ద్వారా మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట అశోక్ అన్నారు. భారత్ స్వాభిమాన్ ట్రస్ట్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో గురువారం సిద్దిపేట వ్యాస మహర్షి యోగా సెంటర్లో ఉచిత మహిళ యోగా శిక్షణ తరగతులు ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. మహిళల మానసిక, శారీరక దృఢత్వానికి యోగా చక్కటి సాధనమన్నారు. కార్యక్రమంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్ తోట సంధ్య, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ సతీష్, కౌన్సిలర్ నాగరాజురెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాజేశం, ప్రధానోపాధ్యాయులు మంజు భార్గవి, సభ్యులు విదిష, నందిని, విజయ, వాణి పాల్గొన్నారు.