
భూభారతితో భూసమస్యలకు చెక్
ములుగు(గజ్వేల్): జిల్లాస్థాయిలోనే భూసమస్యలు పరిష్కారమయ్యేలా భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. మంగళవారం ములుగు మండల కేంద్రంలో భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాదా బైనామాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు మాదిరిగా, భూమికి భూధార్ కార్డులు జారీ చేస్తామన్నారు. దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రకళ, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ మోహన్, వైస్చైర్మన్ ప్రభాకర్, తహసీల్దార్ ఆరిఫా, ఏడీఏ అనీల్కుమార్, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
పటిష్టంగా అమలు
మర్కూక్(గజ్వేల్): భూభారతిని పటిష్టంగా అమలు చేస్తామని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన మర్కూక్లో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనిషికి ఆధార్ కార్డు మాదిరి భూమికి భూధార్ కార్డు అని, భూమి హద్దులు జీపీఆర్ఎస్లో పొందుపరిచి పటిష్టంగా ఉంచడంలో భూదార్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.
మార్కెట్ నిర్మాణం చేపడతాం
వంటిమామిడి మార్కెట్ యార్డు వద్ద రాజీవ్రహదారిపై క్రయవిక్రయాల రద్దీని అధిగమించేందుకు యార్డు ఎదుట ఉన్న ఖాళీ ప్రదేశంలో మార్కెట్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ మనుచౌదరి తెలిపారు. మంగళవారం వంటిమామిడి ఏఎంసీని ఆయన సందర్శించి అక్కడి స్థితిగతులను పరిశీలించారు. మార్కెట్ యార్డు ఎదుట ఉన్న రాజీవ్రహదారిపై వ్యాపారస్తులు, రైతులు, క్రయవిక్రయాలు కొనసాగిస్తుండటంతో ఆ మార్గంలో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి భారీగా ట్రాఫిక్ స్తంభిస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్యార్డు ముందర మార్కెట్యార్డు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపి అతి త్వరలో మార్కెట్ నిర్మాణాన్ని సైతం పూర్తి చేస్తామని కలెక్టర్ చెప్పారు.
రైతులకు భూధార్ కార్డులు
కలెక్టర్ మనుచౌదరి
ములుగులో చట్టంపై అవగాహన