విద్యార్థులు హిందీలోనూ రాణించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు హిందీలోనూ రాణించాలి

May 31 2025 6:57 AM | Updated on May 31 2025 6:57 AM

విద్య

విద్యార్థులు హిందీలోనూ రాణించాలి

డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): విద్యార్థులు హిందీలోనూ రాణించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ఐదు రోజుల పాటుగా నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి శుక్రవారం డీఈఓ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ హిందీ భాష అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ి హిందీ భాషోపాధ్యాయుల్లో సామర్థ్య నిర్మాణం కోసం కృషి చేసిన శిక్షణ శిబిరం నిర్వహకులను డీఈఓ అభినందించారు. అనంతరం శిక్షణ అందించిన ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో కోర్సు కోఆర్డినేటర్‌ మనోహర్‌, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు తిరుపతిరెడ్డి, డీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు

గడువు పెంపు

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిఫ్‌ కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువును జూన్‌ 30 వరకు పెంచినట్లు జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి కవిత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే.. బెస్ట్‌ అవైలెబుల్‌ స్కూల్‌లో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. అర్హులైన విద్యార్థులు జూన్‌ 1 నుంచి జూన్‌ 16 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు చేయాలన్నారు. జూన్‌ 20న ఉదయం 11గంటలకు జిల్లా కలెక్టర్‌ట్‌ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో విద్యార్థుల ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ బడుల్లోనే

నాణ్యమైన విద్య

ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి

గజ్వేల్‌రూరల్‌: రపభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎమ్మెల్సీ డాక్టర్‌ యాదవరెడ్డి అన్నారు. టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాట ప్రచారజాత శుక్రవారం గజ్వేల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డితో కలిసి పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ఇందిరాపార్కు చౌరస్తా వరకు జరిగిన ప్రచార జాత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చదివించాలని అన్నారు. టీఎస్‌ యూటీఎఫ్‌ ఉపాధ్యాయ ప్రయోజనాలే కాకుండా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విలువలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అవసరమయ్యే మౌలిక వసతులున్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపేలా చొరవ చూపాలన్నారు.

విద్యార్థులు హిందీలోనూ రాణించాలి 
1
1/1

విద్యార్థులు హిందీలోనూ రాణించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement