
మొదటిరోజే సర్వర్ డౌన్
దుబ్బాక: సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రభుత్వం కొత్తగా స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టిన మొదటి రోజే ఇబ్బందులు తలెత్తాయి. సర్వర్ డౌన్తో స్లాట్ బుకింగ్ కాకపోవడంతో గంటల తరబడి క్రయవిక్రయ దారులు అవస్థలకు గురయ్యారు. జిల్లాలో సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల, హుస్నాబాద్లో ఉన్నాయి. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు కింద తొలివిడతలోనే ఏప్రిల్ 10 నుంచి సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్, గజ్వేల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్బకింగ్ ప్రక్రియ అమలు చేస్తున్నారు. దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే తొలిరోజునే సర్వర్ డౌన్తో పాటు కొత్తగా ప్రక్రియ కావడంతో రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది తలెత్తింది.
కేవలం 70 డాక్యుమెంట్లే..
స్లాట్ బుకింగ్ ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజున జిల్లాలోని ఆరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కేవలం 70 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కావడం శోచనీయం. ఇది వరకే స్లాట్ బుకింగ్ ప్రారంభమైన సిద్దిపేట అర్బన్, రూరల్, గజ్వేల్ కార్యాలయాల్లో కొంత వరకు డాక్యుమెంట్లు కాగా, చేర్యాలలో ఒక్కటి కూడా కాకపోగా దుబ్బాకలో కేవలం 3, హుస్నాబాద్లో 5 మాత్రమే అయ్యాయి.
స్లాట్ బుకింగ్కు అడ్డంకి
రిజిస్ట్రేషన్లకు తప్పనితిప్పలు
3 డాక్యుమెంట్లు చేశాం..
సా్లట్ బుకింగ్ విధానం ప్రారంభమైన రోజు 3 డాక్యుమెంట్లు చేశాం. గిఫ్ట్ డీడీతో పాటు 2 మార్టిగేజ్ డాక్యుమెంట్లు ఉన్నాయి. స్లాట్లు బుకింగ్ చేసుకొని రావడంతో వచ్చిన వారికి కేవలం 10 నిమిషాల్లోనే రిజిస్టేషన్ చేసి డాక్యుమెంట్లు ఇచ్చాం. క్రయ విక్రయదారులే అన్ని వివరాలతో స్లాట్ బుకింగ్ చేసుకొని రావడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులభ తరం అవుతోంది.
– సుగుణశ్రీ, దుబ్బాక సబ్ రిజిస్ట్రార్

మొదటిరోజే సర్వర్ డౌన్