
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
కేంద్ర మంత్రి బండి సంజయ్
అక్కన్నపేట(హుస్నాబాద్): ఇటీవల ఉపాధి హామీ పనులు చేస్తుండగా మరణించిన బాధిత కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆదివారం మృతుల కుటుంబ సభ్యులు కరీంనగర్లో బండి సంజయ్ని కలిసి తమ గోడును విన్నవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని వారి కుటుంబాలకు అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఒక్కో కుటుంబానికి రూ.రెండు లక్షల చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్రెడ్డి, గోవర్ధనగిరి మాజీ సర్పంచ్ రాములు, మండల అధ్యక్షుడు రామంచ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘వాలీబాల్’ ఎంపికలు
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం అధికారులు ఆదివారం ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. స్ధానిక స్టేడియంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 2025–26 క్రీడా సంవత్సర శిక్షణ కోసం అర్హులైన వారికి ఎంపిక చేపట్టారు. వివిధ జిల్లాలోని 94మంది బాలురు, 31మంది బాలికలు హాజరయ్యారు. హైదరాబాద్ క్రీడా సమాఖ్య ప్రతినిధుల ఆధ్వర్యంలో సెలెక్షన్స్ జరిగాయి. ఎంపికై న వారి వివరాలు త్వరలో వెల్లడిస్తామని జిల్లా క్రీడల శాఖ అధికారి వెంకట్ నర్సయ్య పేర్కొన్నారు.
ఫొటోగ్రాఫర్లపై
దాడులు సరికాదు
గజ్వేల్రూరల్: ఫొటో గ్రాఫర్లపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామని గజ్వేల్ మండల ఫొటో, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. మేడిపల్లిలో జరిగిన ఓ వేడుకల్లో ఫొటోగ్రాఫర్పై దాడి చేయడం దారుణమన్నారు. ఈమేరకు ఆదివారం గజ్వేల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపారు. అనంతరం దాడిచేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టినరోజు, గృహ ప్రవేశాలు, ప్రీవెడ్డింగ్, సాంగ్స్ షూట్, వివాహాల వంటి శుభ కార్యక్రమాల్లో ఫొటోగ్రఫీ ఎంతో ముఖ్యమైనదని, ఈ వృత్తినే నమ్ముకొని ఎంతోమంది జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గజ్వేల్ మండల ఫోటో, వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా

బాధిత కుటుంబాలకు అండగా ఉంటా