
సుబ్రహ్మణ్యేశ్వరుడికి లక్ష పుష్పార్చన
వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధమైన విద్యాసరస్వతి క్షేత్రంలోని సుబ్రహ్మణ్యేశ్వరాలయంలో కృత్తిక నక్షత్ర మహోత్సవం వైభవంగా జరిగింది. మంగళవారం తెల్లవారుజామున వేదపండితులు స్వామివారి మూలవిరాట్టుకు పంచామృతాభిషేకం జరిపారు. పట్టువస్త్రాలు, ఆభరణాలు, పూలమాలికలతో అలంకరించారు. స్వామివారి నామాలు పఠిస్తూ సామూహిక లక్షపుష్పార్చన చేశారు. కన్నుల పండువగా సాగిన ఈ మహోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
భూసార పరీక్షలు తప్పనిసరి
గజ్వేల్: మండల పరిధి జాలిగామ గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం భూసారపరీక్షలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఏరియా మేనేజర్ సాయికుమార్ మాట్లాడుతూ రైతులు విచక్షణారహితంగా ఎరువులు వాడటం వల్ల నేలసారం దెబ్బతింటుందని చెప్పారు. నేలల్లో నత్రజని, భాస్వరం, పొటాషియం ఇతర పోషకాల శాతాన్ని తెలుసుకోవడానికి ఏటా భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పరీక్షల ఫలితాల తర్వాత పోషకాలను సరిచేసుకొని, అందుకనుగుణంగా పంటలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్కు సంబంధించిన సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.
మా భూముల్లో
కాల్వలు తవ్వొద్దు
హుస్నాబాద్రూరల్: మా భూముల్లో కెనాల్ కాల్వలు తవ్వొద్దని కూచనపెల్లి రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఇప్పటికే చెరువు, కుంటల నుంచి నీటి కాల్వలు పంట పొలాలకు ఉన్నాయని, మళ్లీ కొత్తగా కెనాల్ కాల్వల కోసం భూములు తీసుకోవడం తగదని అన్నారు. ఎల్లమ్మ చెరువు నుంచి నీటి కాల్వలు కూచనపెల్లి వరకు ఉన్నాయన్నారు. శనకుంటకు నీరు వెళ్లేందుకు పాత కాల్వలు ఉన్నాయని వాటికి మరమ్మతులు చేస్తే సరిపోతుందన్నారు. భూ సేకరణతో చిన్న, సన్నకారు రైతులు నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత మల్లికార్జున్రెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సుబ్రహ్మణ్యేశ్వరుడికి లక్ష పుష్పార్చన