
వేడుకలు సరే.. ఆటలు ఎట్లా?
క్రికెట్ స్టేడియంలో అవతరణ సంబరాలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ అద్దెకు ఇచ్చి.. క్రికెట్ స్టేడియంలో రాష్ట్ర అవతరణ వేడుకలను నిర్వహిస్తుండటంతో క్రీడాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏ వేడుకలైనా సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహిస్తుంటారు. అధికార పార్టీ నేతలకు తలొగ్గి ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కళాశాల గ్రౌండ్ను అద్దెకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందరికీ అందుబాటులో మరో మైదానం లేకపోవడంతో క్రికెట్ స్టేడియాన్ని జిల్లా యంత్రాంగం ఎంచుకుంది. స్టేడియంలో వేడుకలు నిర్వహించనుండటంతో క్రికెట్ పిచ్, పచ్చటి గడ్డి పాడవుతోందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. అదే బాధ్యతతో మళ్లీ పూర్వ స్థితికి స్టేడియాన్ని తీసుకురావాలని వారు కోరుతున్నారు.
– సాక్షి, సిద్దిపేట
● కళాశాల గ్రౌండ్ అద్దెకు..
యాజమాన్యం వింత పోకడ
● వేడుకలతో పిచ్ పాడవుతుందని
క్రీడాకారుల ఆవేదన
● పూర్వ స్థితికి తీసుకురావాలంటూ
వేడుకోలు