అక్రమార్కులపై పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అక్రమార్కులపై పీడీ యాక్ట్‌

Jun 2 2025 7:35 AM | Updated on Jun 2 2025 7:35 AM

అక్రమార్కులపై పీడీ యాక్ట్‌

అక్రమార్కులపై పీడీ యాక్ట్‌

సిద్దిపేట కమాన్‌: నకిలీ విత్తనాలను విక్రయించి రైతులను మోసం చేస్తే సహించేదిలేదని, వారిపై పీడీ యాక్ట్‌ విధిస్తామని సీపీ అనురాధ హెచ్చరించారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ నకిలీ విత్తన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు టాస్క్‌ ఫోర్స్‌, వ్యవసాయ శాఖ అధికారులతో ప్రత్యేక టీమ్స్‌ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విత్తన ప్యాకెట్‌ మీద తేదీ సరిచూసుకొని కొనాలని, అనుమానం ఉంటే ఫిర్యాదు చేయాలని ఆమె రైతులుకు సూచించారు. విత్తన, ఎరువుల గోదాంలను ఆకస్మికంగా తనిఖీ చేసి శాంపిల్స్‌ సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు.

పటిష్టమైన బందోబస్తు..

జిల్లాలో టెన్త్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు సీపీ అనురాధ పేర్కొన్నారు. జూన్‌ 3 నుంచి 13 వరకు పరీక్షలు జరగనున్నాయన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద163 సెక్షన్‌ అమలు చేసినట్టు తెలిపారు. పరీక్ష సమయానికి గంట ముందే విద్యార్థులు చేరుకోవాలని సూచించారు.

నకిలీ విత్తనాలతో

మోసం చేస్తే సహించం

పోలీసు కమిషనర్‌ అనురాధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement