రాజకీయాలకు అతీతంగా పథకాలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

రాజకీయాలకు అతీతంగా పథకాలు అందించాలి

Jun 2 2025 7:35 AM | Updated on Jun 2 2025 7:35 AM

రాజకీయాలకు అతీతంగా పథకాలు అందించాలి

రాజకీయాలకు అతీతంగా పథకాలు అందించాలి

హుస్నాబాద్‌: రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలని సీపీఎం నియోజకవర్గ నాయకుడు శివరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో అట్టడుగున ఉన్న పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు, అర్హులైన వారికి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వాలన్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకానికి నిరుద్యోగ యువతి, యువకులు ఆన్‌లైన్‌ దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా అర్హులైన యువతకు రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని వర్తింపజేసి యూనిట్లను మంజూరు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం నాయకులు గుగులోతు రాజు నాయక్‌, భూక్య భాస్కర్‌, రాజు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement