
మా భూములు మాకివ్వండి
మంత్రి పొన్నంకు రైతుల విన్నపం
తోటపల్లి రిజర్వాయర్ కోసం సేకరించిన భూములు తిరిగి ఇవ్వాలని రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం రాంచంద్రాపూర్కు చెందిన పలువురు రైతులు మంత్రి పొన్నం ప్రభాకర్కు విన్నవించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయమే జీవనాధారమన్నారు. సుమారు 600ఎకరాల సాగు భూమి ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా చేసేదిలేక సాగు చేసుకుంటున్నామని చెప్పారు. ఆ భూములన్నీ తిరిగి మాకే అప్పజెప్పాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ విషయమై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కార్యక్రమంలో రైతులు వెంకట్రెడ్డి, మహేందర్రెడ్డి, బత్తుల రాజు, బినవేణి రామస్వామి, లక్ష్మణు, మైలు మల్లేశం, బోలుమల్ల దేవమ్మ, భారతవ్వ తదితరులు ఉన్నారు. –కోహెడరూరల్(హుస్నాబాద్)