
దుకాణాల వేలానికి స్పందన కరువు
దుబ్బాకటౌన్: దుబ్బాక పట్టణంలోని మున్సిపల్ దుకాణ సముదాయాల వేలానికి స్పందన కరువైంది. మున్సిపల్ పరిధిలోని మూడు ప్రదేశాల్లోని దుకాణ సముదాయాల్లో 26 షెట్టర్లు ఉన్నాయి. ఇందులో పోచమ్మ దేవాలయ వద్ద ఉన్న 16 షెట్టర్లలో గతంలో దక్కించుకున్న 11 మంది వ్యాపారస్తులు రెన్యూవల్ చేయించుకున్నారు. కాగా 5 షెట్టర్లకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం బహిరంగ వేలం పాట నిర్వహించగా అందులో కేవలం మూడు షెట్టర్లకు మాత్రమే వేలం పూర్తయింది. షెట్టర్ నం.3కి దరఖాస్తులే రాకపోవడంతో రెండు షెట్టర్లకు వేలం వాయిదా వేశారు. షెట్టర్ నం.7ను మహ్మద్ నజీర్ రూ.12500, షెట్టర్ నం.14ను గంట రాజు రూ.7500, షెట్టర్ నం.17ను సోమ వినయ్ రూ. 9300 నెలసరి అద్దె ప్రాతిపదికన దక్కించుకున్నారు.
ఆసక్తి చూపని వ్యాపారస్తులు
లాల్ బహదూర్ శాస్త్రి సమీపంలోని 6 షెట్టర్లకు కేవలం ఒకే దరఖాస్తు రావడంతో అధికారులు వేలం వాయిదా వేశారు. అలాగే డబుల్ బెడ్రూం సమీపంలోని 4 షెట్టర్లకు కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఆ ప్రదేశాల్లో వ్యాపార నిర్వహణకు వ్యాపారస్తులు ఆసక్తి చూపడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు.
15 షెట్టర్లకు కేవలం
మూడింటికి మాత్రమే వేలం
ఆసక్తి చూపని వ్యాపారస్తులు