ఉత్సాహంగా వీడ్కోలు సమావేశాలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా వీడ్కోలు సమావేశాలు

Feb 23 2025 8:02 AM | Updated on Feb 23 2025 8:02 AM

ఉత్సాహంగా వీడ్కోలు సమావేశాలు

ఉత్సాహంగా వీడ్కోలు సమావేశాలు

మద్దూరు(హుస్నాబాద్‌): ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్‌ సురేశ్‌రెడ్డి ఆకాంక్షించారు. కళాశాలలో శనివారం ఉత్సాహంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ గ్రామాల్లో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను కళాశాలలో చేర్పించాలన్నారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కంఠరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనువాస్‌, బాలసిద్దులు తదితరులు పాల్గొన్నారు.

చక్కగా చదువుకోవాలి

నంగునూరు(సిద్దిపేట): పరీక్షలకు భయపడకుండా విద్యార్థులు చక్కగా చదివి మంచి మార్కులు సాధించాలని అక్కేనపల్లి మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ జానయ్య కోరారు. పదోతరగతి, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు శనివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో కాంప్లెక్స్‌ హెచ్‌ఎం రామస్వామి, శ్రీనివాస్‌, రజిత, పవన్‌కుమార్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement