సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షల్లోభాగంగా చివరిరోజైన గురువారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 18,181మంది విద్యార్థులు హాజరు కాగా 730 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 16,749 మంది విద్యార్థులు హాజరు కాగా 492 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఒకేషనల్ విభాగంలో 1,432 మంది హాజరుకాగా 238 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. హాజరు96.14%గా నమోదైనట్లు జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి గోవిందరాం తెలిపారు. డీఐఓ రెండు, డీఈసీ మెంబర్లు 11, హెచ్పీసీ మెంబర్లు 03, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 11, 08 సిట్టింగ్ స్క్వాడ్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.


