రైతులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు కలగనివ్వొద్దు

Mar 13 2026 9:05 AM | Updated on Mar 13 2026 9:05 AM

రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ లోకేశ్‌ కుమార్‌

రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ లోకేశ్‌ కుమార్‌

కంది(సంగారెడ్డి): భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలో విక్రేతలు, కొనుగోలుదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ లోకేశ్‌ కుమార్‌ సూచించారు. మండల కేంద్రమైన కందిలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని గురువారం సందర్శించి భూభారతి ద్వారా జరుగుతున్న భూముల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా భూములు విక్రయించే వారు, కొనుగోలుదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిజిటల్‌ సర్వే చేసే విధానాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ రాజీవ్‌ గాంధీ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement