డీసీసీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల
పటాన్చెరు టౌన్: రైతులకు మెరుగైన సేవలు అందించడంతోపాటు మార్కెట్ సౌకర్యాలను విస్తరిస్తా మని డీసీసీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికై న మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, వైస్ చైర్మన్ మదాస్ రాజశేఖర్లు టీజీఐఐసీ చైర్పర్సన్, డీసీసీ అధ్యక్షురాలు నిర్మలను గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ అభివృద్ధి, రైతులకు మెరుగైన సేవలు అందించడం, మార్కెట్ సౌకర్యాల విస్తరణ వంటి అంశాలపై చర్చించారు.


