వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రెడ్డి
కంది(సంగారెడ్డి): మహిళలు, పురుషులు అన్ని వయసుల వారు చదవడం రాయడం నేర్వాలని వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రమైన కంది మధిర గ్రామమైన కంది లక్ష్మినగర్ తండాలో మంగళవా రం ఉల్లాస్, నవభారత్ సాక్షరతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన అధికారి జ్యోతిశర్మ, ఎన్సీఈఆర్టీ అధికారులు అల్కాయోగి, డైనాథామస్, రిటైర్డ్ డైరెక్టర్ నాగలక్ష్మి పాల్గొని తండాకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమయ్యా రు. సామాజిక చైతన్య కేంద్రాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆధ్వర్యంలో చదవడం, రాయడంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.


