8 తులాల బంగారం చోరీ
హుస్నాబాద్: ఇంటి యజమాని కళ్లుగప్పి దొంగలు బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ ఘటన బుధవారం హుస్నాబాద్లో చోటు చేసుకుంది. పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఎస్వీ రమణ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ షాపు దుకాణ యజమాని రమణ దంపతులు గ్రౌండ్ ఫ్లోర్లో నివాసం ఉంటున్నారు. పై అంతస్తులో ఉన్న బెడ్రూంలోని కబోర్డులోని ఓ పెట్టెలో దాచిన ఎనిమిది తులాల బంగారాన్ని దొంగలు అపహరించారు. పెట్టెలో కొంత డబ్బు, చిన్న చిన్న వస్తువులు ఉన్నా వాటిని ముట్టలేదు. అయితే.. ఇది దుకాణంలో ఉన్న వర్కర్లు ఈ చోరీకి పాల్పడ్డారా అనే అనుమానం వ్యక్తమవుతోంది.


