సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగుల నిరసన | - | Sakshi
Sakshi News home page

సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగుల నిరసన

Oct 18 2025 9:55 AM | Updated on Oct 18 2025 9:55 AM

సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగుల నిరసన

సర్వశిక్ష అభియాన్‌ ఉద్యోగుల నిరసన

న్యాల్‌కల్‌(జహీరాబాద్‌): రెండు నెలలుగా గౌరవ వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం చర్యలు తీసుకొని వేతనాలు వెంటనే చెల్లించాలని ఎస్‌ఎస్‌ఏ (సర్వ శిక్ష అభియాన్‌) ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మార్సీ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు శుక్రవారం ఉదయం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమయానికి వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో రవి, మానిక్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement