అప్రమత్తతతోనే ఆనందకేళి | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతతోనే ఆనందకేళి

Oct 18 2025 9:55 AM | Updated on Oct 18 2025 9:55 AM

అప్రమత్తతతోనే ఆనందకేళి

అప్రమత్తతతోనే ఆనందకేళి

సంగారెడ్డి క్రైమ్‌: దీపావళి పండుగలో పెద్దల కంటే పిల్లల సందడే ఎక్కువ. బాణాసంచా పేల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. పండుగను సంతోషంగా జరుపుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. టపాకాయలు కాల్చే సమయంలో చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చిన్నపాటి కారణాల వల్ల ప్రతి సంవత్సరం చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. జిల్లాలో కంటి చూపు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

● ముఖ్యంగా గ్యాస్‌ సిలిండర్లు మండే పదార్థాలు టపాకాయలకు దూరంగా ఉంచాలి.

● ఇంట్లో, మేడపై కాల్చడానికి ప్రయత్నించవద్దు. బహిరంగ ప్రదేశాలు, ఆరు బయట మాత్రమే కాల్చాలి.

● ఎలాంటి అగ్ని ప్రమాదాలు సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్‌లతో నిండుగా నీళ్లను పక్కన పెట్టుకోండి.

● నిప్పు రవ్వలు దుస్తులపై పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కాటన్‌ దుస్తులని ధరించాలి.

● గాయాలైనప్పుడు సెప్టిక్‌ కాకుండా నిరోధించేందుకు బర్నల్‌ లేదా దూది అయోడిన్‌ తదితర కూడిన ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్టు అందుబాటులో ఉంచుకోవాలి.

● పిల్లలు కాల్చే సమయంలో పెద్దలు పక్కనే ఉండటం అత్యంత శ్రేయస్కరం.

ఇవి తప్పనిసరి

● టపాకాయలను ఒకసారి అంటించిన తర్వాత వెలగలేదని చూసేందుకు దగ్గరకు వెళ్లవద్దు. ప్రమాదవశాత్తు కొన్నిసార్లు పేలే ప్రమాదం ఉంటుంది.

● ఏమాత్రం జాగ్రత్తగా ఉన్న నిప్పు రవ్వలు పూరి గుడిసెలు, గడ్డివాములపైకి దూసుకెళ్లి అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి.

● చుడీదార్‌ వేసుకునేవారు వదులుగా ఉన్నవి కాకుండా బిగుతుగా ఉండేవి వేసుకోవాలి.

● పర్యావరణ హితమెన టపాకాయలు (గ్రీన్‌) వాడితే మంచిది.

బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి

సూచిస్తున్న నిపుణులు

పిల్లలు కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement