భూ భారతిపై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

భూ భారతిపై అవగాహన ఉండాలి

Apr 30 2025 7:12 AM | Updated on Apr 30 2025 7:12 AM

భూ భారతిపై అవగాహన ఉండాలి

భూ భారతిపై అవగాహన ఉండాలి

● ఖేడ్‌లో ఆర్వోఆర్‌ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే సంజీవరెడ్డి ● సాదాబైనామాల పరిష్కారానికి మార్గదర్శకాలు: కలెక్టర్‌ క్రాంతి

నారాయణఖేడ్‌: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కొత్తగా ప్రవేశ పెట్టిన భూ భారతి చట్టంపై రైతులు అవగాహన ఏర్పరుచుకోవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పేర్కొన్నారు. ఖేడ్‌లో మంగళవారం నిర్వహించిన భూ భారతిపై అవగాహన సదస్సుకు కలెక్టర్‌ వల్లూరు క్రాంతితోపాటు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....భూ సమస్యలు ఉన్న రైతులు ఏడాదిలోగా భూ భారతి పోర్టల్‌ ద్వారా దర ఖాస్తులు చేసుకోవాలన్నారు. నిర్దిష్ట గడువులోగా సమస్యలను పరిష్కారమవు తాయని తెలిపారు. సమస్యలు పరిష్కరించేందుకు ఆర్డీఓ, కలెక్టర్‌కు అధికారాలు కల్పించారని చెప్పారు. ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కాకుంటే సీసీఎల్‌ఎతో పాటు ల్యాండ్‌ ట్రిబ్యునల్‌కు సైతం అప్పీల్‌ చేసుకునే అవకాశముందని తెలిపారు. రుణమాఫీ, ఇళ్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, సన్నవడ్లకు బోనస్‌, లబ్ధిదారులకు సన్నబియ్యం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

ప్రతీ సంవత్సరం ప్రదర్శనకు రికార్డులు

జోగిపేట(అందోల్‌)/వట్‌పల్లి (అందోల్‌): ప్రతీ గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి ప్రతి ఏటా గ్రామాల్లో రికార్డులను ప్రదర్శనకు ఉంచుతారని కలెక్టర్‌ క్రాంతి పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ప్రతీ గ్రామంలో పరిపాలనా అధికారులను నియమించేందుకు చర్యలు తీసుకుంటోందని వివరించారు. ధరణిలో ఉన్న భూ రికార్డులు భూ భార తి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించదని తెలిపారు. వీటికి సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు వెలువడతాయని చెప్పా రు. అనంతరం జోగిపేట, వట్‌పల్లిలో భూ భారతి చట్టంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుల్లో కలెక్టర్‌ మాట్లాడుతూ...భూముల సరిహద్దులను సైతం జీపీఎస్‌ సిస్టమ్‌తో భూభారతి ద్వారా హద్దులు తెలుసుకునేందుకు వీలుందన్నారు. భూ భారతిలో రికార్డుల సవరణ, మ్యూటేషన్‌కు ముందే మ్యాప్‌ తయారు చేయడం, పాసు బుక్కులోనే భూమి పటం వంటి నూతన అంశాలు ఉన్నా యని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్‌, ఖేడ్‌ ఆర్డీఓలు, అశోక చక్రవర్తి, పాండు, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ జగన్మోహన్‌రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement