పెళ్లి కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పెళ్లి కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య

Apr 28 2025 7:28 AM | Updated on Apr 28 2025 7:28 AM

పెళ్లి కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య

పెళ్లి కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య

మద్దూరు(హుస్నాబాద్‌): పురుగు మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని గాగ్గిళ్లాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ షేక్‌ మహబుబ్‌ కథనం మేరకు.. గ్రామానికి చెందిన బోడపట్ల బాలరాజు(29) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐదేళ్లుగా బాలరాజుకు కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ ఎక్కడా కుదరకపోవడంతో మానసింగా కుంగిపోయి మద్యానికి బానిసయ్యాడు. 23న తమ్ముడు బోడపట్ల రాజేందర్‌కి పెళ్లి కావడంతో మనస్తాపానికి గురై శనివారం రాత్రి వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంటుబ సభ్యులు చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తల్లి అంజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మనస్తాపంతో వివాహిత

కొండపాక(గజ్వేల్‌): ఉరేసుకొని వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కుకునూరుపల్లి ఎస్సై శ్రీనివాస్‌ కథనం మేరకు.. కుకునూరుపల్లి మండలంలోని కోనాయిపల్లికి దున్నపోతుల కలవ్వ (36) కొన్నేళ్ల కిందట భర్తతో విడాకులు తీసుకుంది. కూతురు, కొడుకుతో కలిసి కోనాయిపల్లిలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. 26న రాత్రి తల్లి కిష్టవ్వ, పిల్లలతో కలిసి భోజనం చేసి వేసవి కాలంలో కావడంతో అందరూ కలిసి ఇంటి బయట నిద్రించారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కలవ్వ మనస్తాపానికి గురై రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఇంట్లోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తమ్ముడు అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement