
ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి
జిన్నారం (పటాన్చెరు): జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో శనివారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో పలు పరిశ్రమలు వాతావరణంలోకి విష వాయువులను విడుదల చేశారు. దీంతో పారిశ్రామిక వాడ ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. విషవాయువులు లీఫార్మా పరిశ్రమ నుంచి విడుదలైనట్లు స్థానికులు గుర్తించారు. నిత్యం ఉదయం సాయంకాల వేళలో పరిశ్రమ గొట్టాల నుంచి విషవాయువులను విడుదల చేస్తున్నారని వీటిని పీల్చడంతో చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్య పాలవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. పీసీబీ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి కాలుష్యాన్ని విడుదల చేస్తున్న పరిశ్రమలపై ఇప్పటికై నా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.