
అగ్నిమాపక సేవా వారోత్సవాలు
రామచంద్రాపురం(పటాన్చెరు): రామచంద్రాపురం బీహెచ్ఈఎల్ యూనిట్లో సోమవారం సీఐఎస్ఎఫ్ అగ్నిమాపక విభాగం ఆధ్వర్యంలో జాతీయ అగ్నిమాపక సేవా వారోత్సవల ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాసరచన, చిత్రలేఖ పోటీలను నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జీఎం విజయ సాగర్, సీఐఎస్ఎఫ్ కమాండెంట్ మంజీత్ కుమార్, ఎస్డీజీజిఎం అరవింద్ కుమార్, ఇన్స్పెక్టర్ బి.ఎస్.భండారి పాల్గొన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించారు.