గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి

Jan 20 2026 10:18 AM | Updated on Jan 20 2026 10:18 AM

గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి

గణతంత్ర వేడుకలకు సిద్ధం కావాలి

● అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి

ఇబ్రహీంపట్నం రూరల్‌: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాల్స్‌, శకటాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించాలని అన్నారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.

ప్రజావాణికి 33 ఫిర్యాదులు

ఈ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 33 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డికి విన్నవించి అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అందించే వినతులను పెండింగ్‌లో పెట్టకుండా సంబంధిత అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement