గ్రామాభివృద్ధికి శిక్షణ కీలకం | - | Sakshi
Sakshi News home page

గ్రామాభివృద్ధికి శిక్షణ కీలకం

Jan 20 2026 10:18 AM | Updated on Jan 20 2026 10:18 AM

గ్రామాభివృద్ధికి శిక్షణ కీలకం

గ్రామాభివృద్ధికి శిక్షణ కీలకం

శంషాబాద్‌ రూరల్‌: గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య సూచించారు. మండలంలోని ముచ్చింతల్‌ శివారు స్వర్ణ భారత్‌ ట్రస్ట్‌ ఆవరణలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సోమవారం నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవస్థ, పాలన విధానాలు, నిబంధనలు, నిర్వహణ అంశాల్లో పూర్తి పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. ఈ శిక్షణ గ్రామాభివృద్ధికి అత్యంత కీలకమని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీఓ సురేశ్‌మోహన్‌, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, పంచాయతీ డైరక్టర్‌ పద్మజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement