చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి | - | Sakshi
Sakshi News home page

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

Jan 17 2026 11:41 AM | Updated on Jan 17 2026 11:41 AM

చదువుతో పాటు  క్రీడల్లో రాణించాలి

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

నందిగామ: యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మామిడిపల్లిలో నిర్వహించిన ఎంపీఎల్‌ లీగ్‌ సీజన్‌–10 క్రికెట్‌ పోటీల విజేతలకు శుక్రవారం బహుమతుల ప్రదానోత్సవం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే క్రీడలను ఆసక్తి ఉన్న క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు.కార్యక్రమంలో సర్పంచ్‌లు హనుమంత్‌ రెడ్డి, చిందం పాండు, ఉప సర్పంచ్‌ రాజు, మాజీ సర్పంచ్‌లు కవిత, సుధాకర్‌ గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement