వైభవంగా గోదాదేవి కల్యాణోత్సవం
మొయినాబాద్రూరల్: గోదాదేవి అవతారమే భూమాత అని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ అన్నారు. బుధవారం ఆలయంలోని అద్దాల మేడలో గోదాదేవి రంగనాయక స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణమహోత్సవంలో భక్తులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అమ్మవారికి పట్టువస్త్రాలు, పూ లు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఉత్సవాల్లో వికారాబాద్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ ముంజులరవియాదవ్, మాజీ మంత్రి సబితారెడ్డి కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
వైభవంగా గోదాదేవి కల్యాణోత్సవం


