ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం

Dec 17 2025 11:09 AM | Updated on Dec 17 2025 11:09 AM

ప్రజా

ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం

సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలంలో హైడ్రాతో కలసి పని చేసిన మాన్సూన్‌ ఎమర్జన్సీ టీమ్‌ (మెట్‌), స్టాటిక్‌ టీమ్‌ల కాంట్రాక్టర్లు మంగళవారం కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో హైడ్రా కమిషనర్‌ మెట్‌ టీమ్‌లతో పాటు కాంట్రాక్టర్లను అభినందించారు. వర్షాకాలంలో కల్వర్టులు, క్యాచ్‌పిట్లలో పూడికను తీయడమే ఒప్పందం అయినప్పటికీ హైడ్రాతో కలసి నాలాలను కూడా క్లియర్‌ చేశారని, ఫలితంగానే వరద సాఫీగా సాగిందని ఆయన అన్నారు. మెట్‌, స్టాటిక్‌ టీమ్‌లు హైడ్రాతో కలిసి పనిచేయడం వల్ల ఈ ఏడాది వర్షాకాలంలో వరద ముప్పును సమర్థంగా ఎదుర్కొన్నామని చెప్పారు.

కడ్తాల్‌: చరికొండకు చెందిన పాలకూర్ల లక్ష్మమ్మ–రాములుగౌడ్‌ కుటుంబం 30 ఏళ్లుగా ప్రజా ప్రతినిధులుగా సేవలందిస్తున్నారు. లక్ష్మమ్మ 1996లో తొలి సారి ఎంపీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం 2006లో జెడ్పీటీసీగా భారీ మెజార్టీతో విజయంసాధించారు. అనంతరం ఆమె భర్త రాములుగౌడ్‌ 2019లో ఎంపీటీసీ సభ్యుడిగా సేవలు చేశారు. ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో వీరి కుమారుడు మహేందర్‌గౌడ్‌ సర్పంచ్‌గా పోటీ చేయగా కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తోంది.

నాడు తనయుడు.. నేడు తల్లి

కడ్తాల్‌: మండల పరిధిలోని చల్లంపల్లి గ్రా మంలో రెండు పర్యాయాలు ఉత్కంఠగా సాగిన పోరులో నాడు తనయుడు, నేడు తల్లికి సర్పంచ్‌ పదవులు వరించాయి. 2013 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామం ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో గ్రామానికి చెందిన నాయిని నరేందర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో గెలిచారు. 2019లో బీసీలకు రిజర్వ్‌ కావడంతో ఆయన పోటీ చేయడం కుదరలేదు. ఇటీవల ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడంతో నాయిని నరేందర్‌ తల్లి యశోధ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో పోటీ చేసి బీఆర్‌ఎస్‌ మద్దతుదారు రేవల్లి మల్లమ్మపై 44 ఓట్లతో విజయం సాధించారు.

అప్పుడు భర్త.. ఇప్పుడు భార్య

వరుసగా సర్పంచ్‌ పదవులను అలంకరించిన దంపతులు

కడ్తాల్‌: మండల పరిధిలోని పల్లెచెలకతండాకు చెందిన దంపతులు వరుసగా సర్పంచ్‌ పదవులను అలంకరించారు. 2018లో జీపీగా ఆవిర్భవించిన ఈగ్రామంలో 2019లో సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించగా, ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. దీంతో తండాపెద్దలు సమావేశమై లోకేశ్‌నాయక్‌ను ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఈనెల 14న జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఎస్టీ మహిళలకు రిజర్వేషన్‌ వచ్చింది. దీంతో లోకేశ్‌నాయక్‌ సతిమణి నీలావతి బీఆర్‌ఎస్‌ మద్దతుతో పోటీ చేసి, కాంగ్రెస్‌ బలపర్చిన అభ్యర్థి అంజమ్మపై 35 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మాన్సూన్‌ ఎమర్జెన్సీ టీమ్‌లకు అభినందనలు

ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం 
1
1/4

ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం

ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం 
2
2/4

ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం

ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం 
3
3/4

ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం

ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం 
4
4/4

ప్రజా సేవలో ‘పాలకూర్ల’ కుటుంబం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement