ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నీ
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శనివారం ప్రారంభమైన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఆఖరి రోజు నాకౌట్ మ్యాచ్లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. పోటీల్లో ప్రథమ స్థానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా, ద్వితీయ స్థానంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, తృతీయ స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్లు నిలిచాయి. విజేతలకు కళాశాల ప్రిన్సిపాల్ కరుణాకర్రెడ్డి ట్రోఫీలు అందజేశారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన 15 మంది క్రీడాకారులను మధ్యప్రదేశ్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో వాలీబాల్ పోటీల రాష్ట్ర పరిశీలకుడు ప్రసాద్, కళాశాల పరిశీలకుడు శ్రీనివాస్రెడ్డి, అధ్యాపకులు, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
ద్వితీయ స్థానంలో జిల్లా జట్టు


