
చిలుకూరులో కృష్ణాష్టమి వేడుకలు
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని మంగళవారం ఉట్ల పండుగను ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ఆలయ పురవీధుల్లో ఊరేగించారు. అనంతరం ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు రంగరాజన్ మా ట్లాడుతూ.. ఉట్ల పండుగ అంటే కేవలం హాండీ పగలగొట్టడం కాదని.. అది వర్ణ, కుల, తరగతుల మధ్య ఉన్న భిన్నతలను తొలగించడం అన్నారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని నిర్వహించే ఈ వార్షిక పండుగ ఐక్యతను ప్రతిబింబిస్తుందన్నారు. వేడుకల్లో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.