యువకుడి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువకుడి అదృశ్యం

Jul 11 2025 12:49 PM | Updated on Jul 11 2025 12:49 PM

యువకుడి అదృశ్యం

యువకుడి అదృశ్యం

పహాడీషరీఫ్‌: యువకుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం చిట్టాపూర్‌ గ్రామానికి చెందిన కేశగోని హరి ప్రసాద్‌(27) తుక్కుగూడలో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తుంటాడు. ఈ నెల 9వ తేదీన ఉదయం 9 గంటలకు డ్యూటీకీ వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన హరిప్రసాద్‌ సాయంత్రమైనా రాలేదు. అతడు ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సాధ్యమైన ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకుండా పోయింది. ఈ విషయమై అతని తండ్రి స్వామి గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement