
రేషన్ డీలర్పై సస్పెన్షన్ వేటు
ఆమనగల్లు: పట్టణానికి చెందిన రేషన్ డీలర్ గాజుల భార్గవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు ఆమెకు ఉత్వర్వులు ఇచ్చేందుకు వెళ్లగా అందుబాటులోకి రాలేదు. దీంతో షాప్కు ఉత్తర్వుల కాపీని అంటించి దుకాణానికి సీజ్ చేశారు.
భూధార్ రిజిస్ట్రేషన్
వేగవంతం చేయాలి
జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు
చేవెళ్ల: భూధార్ కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని డీఏఓ నర్సింహారావు వ్యవసాయాధికారులను ఆదేశించారు. శనివారం ఆయన శంకర్పల్లి మండలం టంగుటూర్లో భూదార్ కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం ఆయన చేవెళ్ల వ్యవసాయ డివిజన్ కార్యాలయంలో ఏడీఏ సురేశ్బాబు, ఏఓ శంకర్లాల్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒక గుంట మొదలుకుని ఎన్ని ఎకరాలున్నా భూధార్ కార్డు కోసం వ్యవసాయాధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే అన్ని పథకాలు ఇక భూదార్ కార్డు ఆధారంగానే కొనసాగుతాయని చెప్పారు. రైతులంతా వ్యవసాధికారులకు సహకరించి ఈ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కోరారు.
రైతు క్లస్టర్ సందర్శన
మొయినాబాద్ రూరల్: రైతులు భూధార్ తప్పక చేయించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి నర్సింహారావు అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని రైతు క్లస్టర్ను సందర్శించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట చేవెళ్ల ఏడీఏ సురేశ్, మండల వ్యవసాయ అధికారి అనురాధ, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నేటి పొదుపు భవిష్యత్కు భరోసా
సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి
షాద్నగర్రూరల్: మనం చేసే పొదుపు భవిష్యత్కు ఆర్థిక భరోసా ఇస్తుందని సహకార భారతి రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఏబీ కన్వెన్షన్ హాలులో శ్రీరామలింగేశ్వ సహకార సంఘం సమితి 13వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉపేందర్రెడ్డి మాట్లాడుతూ.. మనం ఎంత సంపాదించామనేది ప్రధానం కాదని, ఎంత పొదుపు చేస్తున్నామనేది ముఖ్యమని అన్నారు. అనవసర ఖర్చులను తగ్గించుకుని కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. పొదుపు సహకార సంఘాలద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక చేయూతనందిస్తున్నామని చెప్పారు. అనంతరం దుర్గావాహిణి సంస్థ రాష్ట్ర కన్వీనర్ వాణిసక్కుబాయి మాట్లాడుతూ.. పొదుపు సంఘాలు ప్రజల ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నియోజకవర్గంలో దాదాపు 50 గ్రామాల్లో పొదుపు సంఘాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పొదుపు సంఘాలతో స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామలింగేశ్వర సహకార సంఘం వ్యవస్థాపకుడు కుమారస్వామి, అధ్యక్షుడు మల్లేశ్ పూజారి, ఉపాధ్యక్షుడు మహేందర్, సీఈఓ సుమంత్కుమార్, మేనేజర్ రాఘవేందర్, గ్రామ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
హారికకు ‘ప్రావీణ్య పురస్కార్’
కొడంగల్: పట్టణంలోని నవీన ఆదర్శ పాఠశాల విద్యార్థిని హారికకు రాష్ట్ర స్థాయిలో ప్రావీ ణ్య పురస్కార్ అవార్డు వరించింది. జాతీయ సెమ్స్ ఒలంపియాడ్ ఆధ్వర్యంలో మార్చిలో జాతీయ స్థాయి పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ పోటీల్లో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు సాధించిన హారికను శనివారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో సెమ్స్ ఫౌండేషన్ డైరెక్టర్ రాంచందర్రెడ్డి, ట్రస్టు రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి అవార్డు, మెమొంటో, మెడల్తో సత్కరించారు. శాలువా కప్పి అభినందించారు. నవీన ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేష్ రాజ్ను విశేష పురస్కార్ అవార్డుతో సన్మానించారు.

రేషన్ డీలర్పై సస్పెన్షన్ వేటు