
క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
షాబాద్: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ స్టేడియంలో ఆదివారం ఏఎంఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో చైర్మన్ ఎలుగంటి అభిరామ్రెడ్డి నిర్వహిస్తున్న ఎస్పీఎస్–3 క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కాలె యాదయ్య, జిల్లా గ్రాంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూధన్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు క్రీడాపాలసీకి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాఠశాలలో ఒక స్పోర్ట్స్ టీచర్ ఉండేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. అన్ని మండలాల్లో ఉన్న స్టేడియాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ.. క్రీడాపోటీలతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయని అన్నారు. గెలుపోటములు సమానంగా స్వీకరించి లక్ష్యం దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, ముడిమ్యాల, పెద్ద మంగళారం సహకార సంఘాల చైర్మన్లు ప్రతాప్రెడ్డి, చంద్రారెడ్డి, పీసీసీ సభ్యుడు షాబాద్ దర్శన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచ్లు, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి