
వర్సిటీ ఫుట్బాల్ చాంపియన్ ఎక్సలెన్సియా
మొయినాబాద్: వర్సిటీ ఫుట్బాల్ ట్రోఫీ చాంపియన్షిప్ను ఎక్సలెన్సియా జట్టు కై వసం చేసుకుంది. అజీజ్నగర్లోని డెక్కన్ అరేనా గ్రౌండ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో గార్డియం జట్టుపై ఎక్సలెన్సియా జట్టు విజయం సాధించింది. రాష్ట్రంలోని వివిధ పాఠశాలల నుంచి 60 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్ నాలుగు నెలలపాటు కొనసాగింది. ఫైనల్స్లో ఎక్సలెన్సియా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మొదటి ఆఫ్లో ఇరు జట్లు 0–0 స్కోర్తో ఉన్నా సెకండ్ ఆఫ్ 58వ నిమిషంలో నిమిష్ 30 యార్డ్ దూరం నుంచి అద్భుతమైన షాట్ కొట్టి ఎక్సలెన్సియా జట్టుకు గోల్ అందించాడు. చివరి వరకు గార్డియా జట్టు గోల్ చేయకపోవడంతో ఎక్సలెన్సియా జట్టు 1–0తో విజయం సాధించింది. విజేత జట్టుకు నిర్వాహకులు బహుమతి అందించారు. గోల్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించిన మినిష్కు బ్యాలన్ డి ఓర్, గోల్డెన్ బూట్ అవార్డులు లభించాయి.
ఆవిర్భావ వేడుకలను
విజయవంతం చేయండి
కేశంపేట: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూలై 1న నిర్వహించనున్న లంబాడా హక్కుల పోరా ట సమితి ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందర్నాయక్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నంగారా భేరి కరపత్రాలను మండల పరిధిలోని ఎక్లాస్ఖాన్పేటలో ఆదివారం ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా చందర్ నాయక్ మాట్లాడుతూ.. లంబాడా హక్కుల పోరాట సమితి ఏర్పడి ఏళ్లు పూర్తవుతున్నందున తండాల్లో ఆవిర్భవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. కార్యక్రమంలో మోహన్నాయక్, గోపాల్నాయక్, బాబురాజ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, సంతోష్ నాయక్, పరశురాంనాయక్, రవి నాయక్, రాజేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఐస్ స్కేటింగ్లో
చిన్నారి సత్తా
పహాడీషరీఫ్: బాలాపూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల చానస్య గౌడ్ 20వ జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్–2025 పోటీల్లో సత్తా చాటింది. ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో శనివారం జరిగిన పోటీలో చానస్య ఒక రజతం, ఒక కాంస్య పతకాన్ని సాధించింది. 9–10 ఏళ్ల విభాగంలో నిర్వహించిన ఈ పోటీల్లో చానస్య మంచుపై దృఢ సంక్పంతో అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించింది. చిన్నారి ఆసక్తిని గమనించిన ఆమె తండ్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోత్సహించడంతో ఆమె ఈ ఘనత సాధించింది.
విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం
పరిగి: విద్య, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడుతామని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని తపస్ కార్యాలయంలో జిల్లా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రతీ ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా తమదృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతీ పాఠశాలలో తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ఉపాధ్యాయుల నుంచి వస్తున్న మల్టీ జోన్–2లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు.

వర్సిటీ ఫుట్బాల్ చాంపియన్ ఎక్సలెన్సియా

వర్సిటీ ఫుట్బాల్ చాంపియన్ ఎక్సలెన్సియా

వర్సిటీ ఫుట్బాల్ చాంపియన్ ఎక్సలెన్సియా