
ఉద్యాన పంటలకు ప్రోత్సాహం
చేవెళ్ల: ఉద్యాన పంటలు, డెయిరీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు అన్నారు. మున్సిపల్ పరిధిలోని దేవునిఎర్రవల్లిలో శనివారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి పొలంలో 21 ఎకరాల్లో చేపట్టిన ఆయిల్పామ్ ప్లాంటేషన్ను స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఉద్యానశాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్బాషాలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆయిల్పామ్ డిమాండ్కు తగిన విధంగా రైతులు ముందుకురావాలన్నారు. సంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలపై దృష్టిసారించాలని సూచించారు. రాష్ట్రంలో డిమాండ్కు సరిపడా కూరగాయలు పండకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఆయిల్పామ్ సాగుకు తెలుగు రాష్ట్రాల భూములు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. దేశానికి సరిపడా కావాలంటే 70లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలో జిల్లాకో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటే లక్ష్యమని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతుభరోసా నిధులు విడుదల చేశామని వెల్లడించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ డ్రిప్ పరికరాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో శనివారం ఒక్కరోజే 557 ఎకరాల్లో ప్లాంటేషన్ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 5వేల ఎకరాల్లో పంట సాగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ముప్పై ఏళ్ల పాటు ఆదాయం
హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ.. ఆయిల్పామ్ సాగుకు ఎకరానికి 52 వేల సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. ఒక్కసారి సాగు చేస్తే ముప్పై ఏళ్ల పాటు ఆదాయం వస్తుందన్నారు. ఇది రైతులకు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ వంటి కార్యక్రమమని స్పష్టంచేశారు.
ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి
జిల్లాతోపాటు చేవెళ్ల నియోజకవర్గంలోని రైతుతులు ఎక్కువగా ఆయిల్పామ్సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. స్థానికంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. అందరికీ అందుబాటులో ఉండేలా గుడిమల్కాపూర్ కూరగాయల మార్కెట్లో లేదా అజీజ్నగర్లో ఏర్పాటు చేసేలా కృషి చేయాలన్నారు.
డ్రోన్ ఇప్పించండి..
సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. మంత్రి స్ఫూర్తితోనే ఆయిల్పామ్సాగుకు ముందుకు వచ్చినట్లు చెప్పారు. తమ గ్రామంలోని రైతు సంఘానికి ఓ డ్రోన్ ఇప్పించాలని, చేవెళ్లలో డివిజన్ వ్యవసాయ, ఉద్యాన కార్యాలయలకు భవనాలు కేటాయించాలని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో గిండ్డంగుల సంస్థల చైర్మన్ ఆర్.నాగేశ్వర్రావు, ఆర్డీఓ చంద్రకళ, జేడీఏ నర్సింహ్మరావు, పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్రెడ్డి, సురేందర్రెడ్డి, గోనే ప్రతాప్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, గోపాల్రెడ్డి, నాయకులు జనార్దన్రెడ్డి, కృష్ణారెడ్డి, మానిక్యరెడ్డి, మధుసూదన్గుప్తా, ఆగిరెడ్డి, వసంతం, దర్శన్, కాలె శ్రీకాంత్, ప్రభాకర్, గోపాల్రెడ్డి, మధుసూదన్రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, వ్యవసాయశాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు, తదితరులు ఉన్నారు.
వాణిజ్య రైతులు దృష్టిసారించాలి
Ð]lÅÐ]l-ÝëĶæ$ Ô>Q Ð]l$…{† ˘™èl$Ð]l$ÃÌS ¯éVóS-ÔèæÓ-ÆŠ‡-Æ>Ð]l#
దేవునిఎర్రవల్లిలో ఆయిల్పామ్ సాగు ప్లాంటేషన్