ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

Jun 29 2025 7:24 AM | Updated on Jun 29 2025 7:24 AM

ప్రభు

ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

మొయినాబాద్‌: నగర శివారుల్లో ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కన్నేశారు. మండల పరిధిలోని కనకమామిడి రెవెన్యూలో రూ.15 కోట్ల విలువచేసే మూడెకరాల ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జాచేసేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు అడ్డుకుని కబ్జారాయుడిపై కేసు నమోదు చేశారు. వివరాలు.. కనకమామిడి రెవెన్యూ సర్వేనెంబర్‌ 510లో 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇదే సర్వే నెంబర్‌లో కేతిరెడ్డిపల్లి వెళ్లే మార్గంలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని నగరానికి చెందిన ఇబ్రహీం అనే వ్యక్తి కబ్జా చేస్తున్నాడు. జేసీబీతో భూమిని చదును చేసి ఫ్రీకాస్ట్‌ వాల్‌తో రూంలు నిర్మిస్తున్నాడు. విషయం తెలుసుకున్న మొయినాబాద్‌ తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌, పోలీసులు, సిబ్బందితో అక్కడికి వెళ్లి కబ్జాను అడ్డుకున్నారు. కబ్జాదారుడు భూమి తనదని అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అధికారులు భూమికి సంబంధించిన పత్రాలు చూపాలని కోరడంతో అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ వీరంగం చేశాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తూ వేసిన ఫెన్సింగ్‌, ఫ్రీకాస్ట్‌వాల్‌ను రెవెన్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిపై రెవెన్యూ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కబ్జాదారుడిపై కేసు నమోదు చేశారు.

వరుస ఘటనలు

మొయినాబాద్‌ మండలంలో ప్రభుత్వ భూముల కబ్జా ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. గురువారం మండల పరిధిలోని తోలుకట్టలో సర్వే నంబర్‌ 155లో రూ.5 కోట్లు విలువ చేసే 1.14 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ నిర్మించిన ఫ్రీకాస్ట్‌వాల్‌ను తొలగించి కబ్జా చెరనుంచి విడిపించారు. శుక్రవారం అజీజ్‌నగర్‌లో సర్వేనెంబర్‌ 177లో రూ.30 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిలో చేపట్టిన నిర్మాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకుని బోర్డులు పెట్టారు. శనివారం కనకమామిడిలో 510 సర్వే నెంబర్‌లో రూ.15 కోట్ల విలువ చేసే మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చెరనుంచి కాపాడి బోర్డులు పెట్టారు.

అడ్డుకున్న రెవెన్యూ అధికారులు

కబ్జాదారుడిపై కేసు

భూముల జోలికొస్తే జైలుకే

ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపిస్తే కొంత మంది అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భూములు కబ్జాచేసేవారు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదు. క్రిమినల్‌ కేసులు పెట్టి జైలుకు పంపిస్తాం. ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్‌ పనులు చేపడుతున్నాం.

– గౌతమ్‌కుమార్‌, తహసీల్దార్‌, మొయినాబాద్‌

ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం 1
1/1

ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement