
మహేశ్వరం జీఎంసీ ఆకస్మిక తనిఖీ
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శనివారం ఆమె ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని భారత్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనతరం నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ త్రివేణిని అడిగి పనులుపై ఆరా తీశారు. ల్యాబ్లను పరిశీలించిన ఆమె విద్యార్థులకు కావాల్సిన సామగ్రి తెప్పించాలని సూచించారు. మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రస్తుతం 50 మంది మాత్రమే ఉన్నారని వారికి ఎలాంటి లోటు లేకుండా చూడాలన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలో నిర్వహించనున్న మొదటి సంవత్సరం పరీక్షలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. మరో మారు హైలెవల్ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. అప్పటి వరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని వసతులు కల్పించి విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం తహసీల్దార్ సునీతారెడ్డి, వైస్ప్రిన్స్పాల్ నాగమణి, డాక్టర్ మహ్మద్ టాకుద్దీన్ తదితరులు ఉన్నారు.
విద్యార్థులకు మౌలిక వసతులు కల్పిస్తాం
మొదటి ఏడాది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేస్తాం
అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్