జిమ్నాస్టిక్స్లోసత్తా చాటిన కీర్తిఆనంద్
హుడాకాంప్లెక్స్: సీఎం కప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన జిమ్నాస్టిక్స్ టేబుల్ వాల్ట్, అనివెన్ బార్ మహిళా విభాగంలో కీర్తి ఆనంద్ ద్వితీయ స్థానం కై వసం చేసుకొని రెండు సిల్వర్ మెడల్స్ను సాధించారు. సరూర్నగర్ హుడాకాంప్లెక్స్ చెందిన కీర్తి ఆనంద్ మెడల్స్తో పాటు రూ.30 వేల నగదును అందుకున్నారు. అనంతరం కోచ్ స్వర్ణలత, కళాశాల సిబ్బంది కీర్తి ఆనంద్ను అభినందించారు. ప్రభుత్వం ప్రోత్సాహంతోనే క్రీడల్లో రాణిస్తున్నానని, భవిష్యత్తులో దేశానికి ప్రాతినిథ్యం వహించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానని కీర్తి ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు.