సార్‌.. అమ్మానాన్న కొడుతుండ్రు | - | Sakshi
Sakshi News home page

సార్‌.. అమ్మానాన్న కొడుతుండ్రు

May 24 2023 10:06 AM | Updated on May 24 2023 10:44 AM

బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి  - Sakshi

బాలుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి

శంకర్‌పల్లి: ‘‘సార్‌.. మా అమ్మానాన్న కొడుతుండ్రు.. నిత్యం నరకం చూపిస్తుండ్రు. వారిని శిక్షించండి’’అంటూ ఓ బాలుడు మంగళవారం శంకర్‌పల్లి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూరుకు చెందిన మాల నర్సింహులు, లక్ష్మి దంపతులు శంకర్‌పల్లిలోని హనుమాన్‌ నగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

రోజు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. లక్ష్మీకి మొత్తం ఐదు మంది సంతానం. మొదటి భర్త కుమారుడైన రాము(11)ను ప్రతిరోజు కొట్టడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ సంతోష్‌రెడ్డి భార్యాభర్తలను కౌన్సెలింగ్‌ ఇచ్చారు. బాలుడిని మరోసారి కొడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement