నయా పైసా ఎవరికీ ఇవ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

నయా పైసా ఎవరికీ ఇవ్వొద్దు

May 26 2025 9:50 AM | Updated on May 26 2025 9:50 AM

నయా పైసా ఎవరికీ ఇవ్వొద్దు

నయా పైసా ఎవరికీ ఇవ్వొద్దు

సిరిసిల్ల/ముస్తాబాద్‌(సిరిసిల్ల): నయా పైసా ఎవరికీ ఇవ్వొద్దు.. ఇసుక ఫ్రీగా ఇస్తాం.. నిరుపేదలకు మెప్మా ద్వారా రూ.లక్ష వరకు బ్యాంకు రుణం ఇప్పిస్తాం.. నిబంధనల మేరకు 600 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకోండి అని... కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు. సిరిసిల్లలో 764 మందికి, ముస్తాబాద్‌లో 491 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలను ఆదివారం పంపిణీ చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పుడు ఇల్లు రాని వారికి రెండో విడతలో ఇస్తామని తెలిపారు. నాలుగు నెలల్లో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి, దసరా, దీపావళి నాటికి గృహప్రవేశాలు చేయాలని కలెక్టర్‌ కోరారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందన్నారు. దివంగత నేత డాక్టర్‌ వైఎస్సార్‌ పాలనలో సిరిసిల్ల నేతన్నలకు 12వేల అంత్యోదయ కార్డులు ఇస్తే.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 7 వేల కార్డులను రద్దు చేసిందన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సిరిసిల్లలో ఇసుకను, గుట్టలను దోచుకున్నారని, రూ.100 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌లు ముక్కలయ్యాయని మహేందర్‌రెడ్డి ఆరోపించారు. ‘సెస్‌’ చైర్మన్‌ చిక్కాల రామారావు, ఏఎంసీ చైర్మన్‌ వెల్ముల స్వరూపారెడ్డి, డీఆర్‌డీవో శేషాద్రి, హౌసింగ్‌ పీడీ శంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పి.వాణి, ముస్తాబాద్‌ ఏఎంసీ చైర్‌పర్సన్‌ తలారి రాణి, సెస్‌ డైరెక్టర్‌ సందుపట్ల అంజిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు చొప్పదండి ప్రకాశ్‌, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, యెల్ల బాల్‌రెడ్డి, కనమేని చక్రధర్‌రెడ్డి, గజ్జెల రాజు, శ్రీనివాస్‌గౌడ్‌, మిర్యాల్‌కార్‌ శ్రీనివాస్‌, కొండల్‌రెడ్డి, దీటి నర్సింలు, యాదగిరిగౌడ్‌, అంజన్‌రావు, తహసీల్దార్‌ సురేశ్‌, ఎంపీడీవో బీరయ్య తదితరులు పాల్గొన్నారు.

ఇసుక ఫ్రీగా ఇస్తాం.. దశలవారీగా బిల్లు చెల్లిస్తాం

నిరుపేదలకు మెప్మా ద్వారా రూ.లక్ష రుణం

కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

సిరిసిల్ల, ముస్తాబాద్‌లలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement