
సీఎం పోరాట ఫలితమే కులగణన
● సిరిసిల్లలో కాంగ్రెస్ నేతల హర్షం ● రేవంత్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం
సిరిసిల్లటౌన్: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పోరాట ఫలితంగానే కేంద్రం దిగివచ్చి జనగణన చేసేందుకు ముందుకొచ్చిందని కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణనపై ప్రకటన చేయడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి చిత్రపటా లకు గురువారం క్షీరాభిషేకం చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. మ్యాన ప్రసాద్, బొప్ప దేవయ్య, నీలి రవీందర్, కల్లూరి చందన, నేరెళ్ల శ్రీకాంత్గౌడ్, గుండ్లపల్లి గౌతం, ఎదురుగట్ల వనిత, రోజా పాల్గొన్నారు.