పాలిస్టర్‌ వస్త్రానికి కూలి పెంచాలి | - | Sakshi
Sakshi News home page

పాలిస్టర్‌ వస్త్రానికి కూలి పెంచాలి

May 30 2025 8:13 AM | Updated on May 30 2025 1:40 PM

Kodam Ramana giving a petition

వినతిపత్రం ఇస్తున్న కోడం రమణ

సిరిసిల్లటౌన్‌: పాలిస్టర్‌ వస్త్రానికి సంబంధించి కార్మికుల కూలి పెంచాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ కోరారు. యజమానులతో చర్చలు జరిపించి కూలి పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్‌ డిస్ట్రిక్ట్‌ లేబర్‌ కమిషనర్‌కు గురువారం వినతిపత్రం అందించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కార్మికుల కూలి ఒప్పందం 2024 ఏప్రిల్‌తోనే ముగిసిందన్నారు. ఈమేరకు యజమానులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూలి పెంచకుంటే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘ఆలయ అభివృద్ధికి వ్యతిరేకం కాదు’

వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, ఈవో తమకు హైకోర్టు ద్వారా కేవియట్‌ నోటీస్‌ పంపించమేంటని రాజన్న ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రశ్నించారు. భీమేశ్వర గార్డెన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి ప్రణాళిక లేకుండానే ఆలయాన్ని మూసివేస్తామనడం సమంజసం కాదన్నారు. తాము సైతం కోర్టులను ఆశ్రయించి భక్తుల మనోభావాలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రాపెల్లి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

గోశాలలో దిద్దుబాటు చర్యలు

వేములవాడఅర్బన్‌: తిప్పాపూర్‌లోని రాజన్న గోశాలలో దిద్దుబాటు చర్యలకు ఆలయ అధికారులు గురువారం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. గోశాలలో పరిశుభ్రత లోపించడం, వరిగడ్డి కట్టలు తడిసిపోయాయన్న విమర్శలకు అధికారులు స్పందించారు. ఆలయ సిబ్బంది, అధికారులు, సేవాసమితి సభ్యులు గోశాలలోని వరిగడ్డి కట్టలను ఆరబెట్టి, వాటిని ఒక చోట పేర్చి టార్పాలిన్‌ కవర్లు కప్పించారు. అంతేకాకుండా బురదతో నిండిపోయిన గోశాలలో వర్షం నీటిని తీయించి బురద కాకుండా చర్యలు తీసుకున్నారు. మరిన్ని సౌకర్యాలు క ల్పిస్తామని ఈవో వినోద్‌రెడ్డి తెలిపారు. ఈఈ రాజేశ్‌, ఏఈ రామకృష్ణారావు, గోశాల పర్యవేక్షకులు విజయ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement