టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమానాథ్రెడ్డి
సిరిసిల్లటౌన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుమాల రమానాథ్రెడ్డి కోరారు. టీపీటీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం గురువారం గీతానగర్ హైస్కూల్లో నిర్వహించారు. ప్రభుత్వాలు మారినప్పుడు విద్యావిధానాలు మారడం, నూతనంగా పాఠశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ పంచాయతీరాజ్ పాఠశాలలు సంక్షోభంలోకి నెట్టివేయబడ్డాయన్నారు.
2008 డీఎస్సీ ఉపాధ్యాయుల వేతనాలు, సమగ్ర సర్వే చేసిన ఉపాధ్యాయులకు గౌరవ వేతనం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర కౌన్సిలర్ సత్తు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి విక్కుర్తి అంజయ్య, ఉపాధ్యక్షులు పురం వాసుదేవరావు, మందాడి శ్రీనివాస్రెడ్డి, నూగురి దేవేందర్, కేవీ రజ నీరాణి, తాళ్లపల్లి శ్రీధర్, మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం పాల్గొన్నారు.
జాగ్రత్తలతో కరోనాను నివారించవచ్చు
● వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: జిల్లాలో కాలానుగుణంగా వ్యాపించే వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. ఈమేరకు గురువారం జిల్లా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ.. ప్రకటన విడుదల చేశారు. సాధారణ జలుబు, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రయాణాలు, జనసమూహాల్లో ఉన్నప్పుడు మాస్క్లు ధరించాలని సూచించారు. కోవిడ్ కేసుల ప్రభావిత ప్రాంతాల్లో నుంచి వచ్చిన వారు అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే నిర్ధారణకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు, పిల్లలు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చికిత్సతోనే నయమవుతుందని తెలిపారు. ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి తక్కువస్థాయి లక్షణాలే నమోదవుతున్నాయని వివరించారు.

పెండింగ్ బిల్లులు చెల్లించాలి

జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత